News March 25, 2025

WNP: ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం: అదనపు కలెక్టర్

image

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు ఆదేశించారు. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం సరఫరా అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రేషన్ డీలర్లు, పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

Similar News

News March 29, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 29, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.41 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 29, 2025

పంచాయతీలకు పండుగ..త్వరలో రహదారుల నిర్మాణం

image

AP: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1202కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను నాబార్డు నిధులు రూ.557 కోట్లను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా మెుత్తం 402 రహదారులు వేయనున్నారు. ఈ రోడ్లను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను DY.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

News March 29, 2025

గాంధారి: వడ్డీ వ్యాపారులపై కేసు

image

గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.

error: Content is protected !!