News September 23, 2025

WNP: దసరా పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి

image

దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండగల కోసం కుటుంబంతో సహా తమ స్వగ్రామాలకు వెళ్లేవారు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలన్నారు. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా బ్యాంకు లాకర్లో లేదా తమ వెంట తీసుకెళ్లడం మంచిదని అన్నారు.

Similar News

News September 23, 2025

హైడ్రా యాక్షన్.. ఎలా అయిందో చూడండి.!

image

గాజులరామారంలో హైడ్రా యాక్షన్‌పై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రూ.15 కోట్ల విలువైన 317 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు తెలిపింది. వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడికి నేల కనిపిస్తోందని చెప్పారు.

News September 23, 2025

డిగ్రీ కోర్సుల్లో చేరికకు రేపే తుది గడువు

image

AP: వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడతలో సీట్లు పొందిన వారు బుధవారం లోగా కాలేజీల్లో చేరాలని OAMDC కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు తమ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. కాగా ఏపీలోని 1200 డిగ్రీ కాలేజీల్లో 3,82,038 సీట్లుండగా తొలివిడతలో 1,30,273 మందికి కేటాయించారు. 251765 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుంది.

News September 23, 2025

కల్వకుర్తి: భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత

image

కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ టోల్ గేట్ వద్ద 300 కిలోల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టుకున్నట్లు ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహనంలో 65 బ్యాగులలో నల్ల బెల్లం, 40 కేజీల పటిక గుర్తించగా, మరో వాహనంలో 10 కేజీల నల్ల బెల్లం 10 కేజీల పటిక గుర్తించినట్లు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.