News March 25, 2025
WNP: మిల్లులపై కేసులు బుక్ చేయండి: కలెక్టర్

గత సీజన్లో ధాన్యం తీసుకొని ఇప్పటివరకు CMR ఇవ్వని రైస్ మిల్లులపై కేసులు నమోదుచేసి, RR యాక్ట్ కింద చర్యలుచేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ లో పౌరసరఫరాల అధికారులతో కలెక్టర్ సమీక్షనిర్వహించారు. 2024-25 వానాకాలానికి సంబంధించి 100% CMR ధాన్యం అప్పగించిన మిల్లర్లకు మాత్రమే తదుపరి సీజన్ ధాన్యం కేటాయించాలని కలెక్టర్ సూచించారు. రబిసీజన్ వరిధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News February 25, 2026
గుంతకల్లు డివిజన్లో ఖాళీల భర్తీకి కసరత్తు

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.
News February 25, 2026
5 OTTలను బ్యాన్ చేసిన కేంద్రం

అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న 5 OTT యాప్స్పై కేంద్రం వేటు వేసింది. MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel, Jugnu అనే ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అసభ్యకరమైన వీడియోలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయనే ఫిర్యాదులతో IT రూల్స్ 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఇకపై ఇవి ఇండియాలో పనిచేయవు.
News February 25, 2026
విజయానికి నాలుగు సూత్రాలు

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకః|
మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయః|
మనది వ్యవసాయాధారిత దేశం కాబట్టి సాగును నమ్ముకుంటే ఆకలి చావులు ఉండవని ఈ శ్లోకం చెబుతోంది. శ్లోకార్థం: కృషి ఉంటే కరవు ఉండదు. జపం చేస్తే పాపాలు నశిస్తాయి. మౌనం వహిస్తే కలహాలు రావు. అప్రమత్తంగా ఉంటే భయం ఉండదు.


