News December 14, 2025
WNP: సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలపండి: ఎస్పీ

వనపర్తి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి అలసత్వం లేకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 15, 2025
రామడుగు హరీష్కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.
News December 15, 2025
సూర్యాపేట: ఒక్క ఓటు తేడాతో BRS మద్దతుదారు గెలుపు

సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం భక్తలాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితం చివరి వరకూ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఎట్టకేలకు BRS బలపరిచిన అభ్యర్థి జుట్టుకొండ గణేశ్ కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. సంచలన విజయం సాధించడంతో BRS శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. గణేశ్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అంకితమవుతానని హామీ ఇచ్చారు.
News December 15, 2025
శంకర్పల్లి: పల్లె లత యాదిలో గెలిపించారు!

గుండెపోటుతో మరణించిన మాసానిగూడ గ్రామ 8వ వార్డు మెంబర్ అభ్యర్థిని పల్లె లత (42)ను వార్డు ప్రజలు గెలిపించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురికాగా కుటుంబీకులు శంకర్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేయగా చికిత్స పొందుతూ డిసెంబర్ 7న మృతి చెందారు. కాగా, నేటి ఫలితాల్లో ఆమెకు 30 ఓట్ల ఆధిక్యం వచ్చింది.


