News February 2, 2025

WNP: మధుమేహ పరీక్షల్లో వేగం పెంచాలి: DMHO

image

ముప్పై ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత మధుమేహ పరీక్షలు చేసే కార్యక్రమాన్ని మరింత వేగం పెంచాలని DMHO డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం గోపాల్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ చాంద్ పాషా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిద్ధ గౌడ్, మహేశ్వర చారి, సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు.

Similar News

News February 2, 2025

పెద్దపల్లిలో MLC కవిత రేపటి పర్యటన షెడ్యూల్

image

పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సోమవారం పర్యటించనున్నారు అని కాల్వ శ్రీరాంపూర్ మండల యూత్ నాయకులు రవి తెలిపారు. పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. 12PM పెద్దపల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు @12:15PM మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో TBGKS నాయకులతో ఆత్మీయ సమీక్షలో పాల్గొంటారు @12:30 మీడియా సమావేశంలో మాట్లాడతారు @1PM సబితం గ్రామంలో జరిగే ఓ వివాహా వేడుకలో పాల్గొంటారు.

News February 2, 2025

T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్

image

అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.

News February 2, 2025

HYD: పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

image

పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు