News April 6, 2024

WNPT: క్షుద్రపూజల పేరుతో రూ.9.73 లక్షలు టోకరా

image

క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని రూ.9.73లక్షలు తీసుకుని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. CI నాగభూషణరావు వివరాలు.. వనపర్తి జిల్లా గోపాల్‌వేటకు చెందిన సుద్దుల రాజు కొడుకు వెంకటేశ్(14)కు మతిస్తిమితం సరిగా లేదు. జ్యోతిష్యాలయం పేరుతో నయం చేస్తామని నమ్మించి మోసం చేసిన APలోని గుంటూరుకు చెందిన పరబ్రహ్మం, వెంకన్న, గోపిను అరెస్ట్ చేసి ఫోన్లు, రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 3, 2026

మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్యాంశాలు

image

✒ఓపెన్ SSC, INTER.. ఫీజు చెల్లించండి
✒సౌత్ జోన్.. పీయూ యోగ జట్టు రెడీ
✒జడ్చర్ల: అనుమానాస్పదంగా బాలిక మృతి
✒రాబోయే ఎన్నికల్లో అధికారం బీజేపీదే:డీకే అరుణ
✒రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన
✒MBNR: సంక్రాంతి పండుగ.. ప్రత్యేక బందోబస్తు:SP
✒ప్రారంభమైన టెట్ పరీక్ష
✒పాలమూరు వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
✒రెబల్‌గా పోటీ చేస్తే సస్పెన్షన్:మల్లు రవి
✒గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

News January 3, 2026

జడ్చర్ల: అనుమానాస్పదంగా బాలిక మృతి

image

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన పిట్టల మల్లయ్య కుమార్తె రాజేశ్వరి(17) ఇంటిలో అనుమానాస్పదంగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించిగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News January 3, 2026

సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయం: వీసీ

image

మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు ఆదర్శప్రాయమని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. జిఎన్ శ్రీనివాస్ అన్నారు. శనివారం వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యవక్తగా న్యాయవాది జనార్దన్ పాల్గొని ప్రసంగించగా, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. ప్రవీణ అధ్యక్షత వహించారు.