News April 6, 2024
WNPT: క్షుద్రపూజల పేరుతో రూ.9.73 లక్షలు టోకరా

క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని రూ.9.73లక్షలు తీసుకుని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. CI నాగభూషణరావు వివరాలు.. వనపర్తి జిల్లా గోపాల్వేటకు చెందిన సుద్దుల రాజు కొడుకు వెంకటేశ్(14)కు మతిస్తిమితం సరిగా లేదు. జ్యోతిష్యాలయం పేరుతో నయం చేస్తామని నమ్మించి మోసం చేసిన APలోని గుంటూరుకు చెందిన పరబ్రహ్మం, వెంకన్న, గోపిను అరెస్ట్ చేసి ఫోన్లు, రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News December 7, 2025
MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్ల విత్డ్రా

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.
News December 7, 2025
MBNR: సర్పంచ్ బరిలో 641 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
News December 7, 2025
MBNR: మూడో విడతలో 2,786 మంది అభ్యర్థులు

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలకు సంబంధించిన తుది వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,152 వార్డులకు గాను, ఏడు వార్డులు మినహా 1,145 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో 2,786 మంది వార్డు సభ్యులు నిలిచినట్టుగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జడ్చర్లలో అత్యధికంగా 376, బాలానగర్లో 308 మంది పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు.


