News March 9, 2025
రైలులో ప్రసవించిన మహిళ

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.
Similar News
News December 4, 2025
ఫీటస్ హార్ట్బీట్ రాకపోవడానికి కారణాలివే..!

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక కొంతమంది తల్లులు వారి కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినలేకపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు నిపుణులు. జన్యు సమస్యలు, hCG లెవల్స్ తగ్గి అబార్షన్ కావడం, పిండానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడం, తక్కువగా ఉమ్మనీరు ఉండడం, బిడ్డలో ఏవైనా లోపాలు, తల్లికి తీవ్ర అనారోగ్యాలు వంటివి కారణం కావొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు ట్రీట్మెంట్ చేస్తారు.
News December 4, 2025
SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News December 4, 2025
నేడు ఇలా చేస్తే.. సిరి సంపదలకు లోటుండదు: పండితులు

నేడు మార్గశిర పౌర్ణమి, గురువారం కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన కొన్ని పూజలు, పనులు చేయడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పండితులు అంటున్నారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయంటున్నారు. ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా, విన్నా కూడా శుభం కలుగుతుంది. దీపారాధన చేయవచ్చు. ఇష్టదైవానికి శనగలు నైవేద్యంగా సమర్పించాలి’ అని సూచిస్తున్నారు.


