News September 29, 2024

మహిళ ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు

image

AP: మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఏలూరు త్రీ-టౌన్ పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఎన్నికల ప్రచార సమయంలో నాగమణి అనే ఓ మహిళా నాయకురాలు గాయపడింది. వైద్య ఖర్చులు భరిస్తామని అప్పుడు హామీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పట్టించుకోలేదని ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో నాని సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవలే పార్టీని వీడారు.

Similar News

News November 16, 2025

కష్టాల్లో టీమ్ ఇండియా.. 75కే 6 వికెట్లు

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 124 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్ (31), జడేజా (16) ఔటయ్యారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 49 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 16, 2025

USలో మండుతున్న ధరలు.. సుంకాలు తగ్గించిన ట్రంప్

image

భారత్‌పై అదనపు సుంకాలు వేయడంతో అమెరికాలో పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. దాదాపు 200 ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించారు. ఇందులో భారత్‌ ఎగుమతి చేసే టీ, మిరియాలు, జీలకర్ర, యాలకులు, పసుపు, అల్లం, జీడిపప్పు, మామిడి వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ సడలింపు భారత వ్యవసాయ ఎగుమతులకు పెద్ద ఊతమిస్తుంది. సీ ఫుడ్, బాస్మతి రైస్‌పై తగ్గించలేదు.

News November 16, 2025

ఓట్ల కోసం ప్రపంచ బ్యాంకు నిధులు మళ్లింపు: PK

image

బిహార్‌లో ఓటమి తర్వాత JSP చీఫ్ ప్రశాంత్ కిశోర్ NDAపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు కేటాయించిన రూ.14,000 కోట్లను ఎన్నికల సమయంలో మళ్లించారని ఆరోపించారు. వాటిని మహిళల ఖాతాల్లోకి రూ.10వేల చొప్పున జమ చేశారన్నారు. జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ప్రభుత్వం ఓట్ల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దీనిపై EC దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.