News May 22, 2024
లోక్సభ బరిలో మహిళా అభ్యర్థులు ‘అంతంత మాత్రమే’

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళలు 10శాతం కన్నా తక్కువేనని ADR నివేదిక పేర్కొంది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో 797 మంది మహిళలు ఉన్నారని.. ఇది కేవలం 9.5 శాతమేనని తెలిపింది. దీంతో లింగ వివక్షకు చోటివ్వకుండా స్త్రీలకు తగిన సంఖ్యలో ప్రాధాన్యం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
Similar News
News January 17, 2026
కోళ్ల పందేలు.. రూ.2వేల కోట్ల వ్యాపారం!

AP: ఈ సంక్రాంతి సీజన్లో కోళ్ల పందేళ్ల రూపంలో సుమారు రూ.2వేల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పందేల విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈసారి జోరుగా పందేలు సాగాయి. పెద్దఎత్తున తెలంగాణవాసులు కూడా పందేళ్లలో పాల్గొని సందడి చేశారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.1.53 కోట్లు గెలుచుకున్నారు.
News January 17, 2026
162 పోస్టులకు NABARD నోటిఫికేషన్ విడుదల

<
News January 17, 2026
మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

TG: రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 38, SC 17, ST 5, జనరల్ కి 61 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీలో స్టేషన్ ఘన్పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్షెట్టిపేట, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్ ఉన్నాయి. పూర్తి వివరాలకు పైన ఫొటోలను స్లైడ్ చేయండి.


