News May 22, 2024

లోక్‌సభ బరిలో మహిళా అభ్యర్థులు ‘అంతంత మాత్రమే’

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళలు 10శాతం కన్నా తక్కువేనని ADR నివేదిక పేర్కొంది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో 797 మంది మహిళలు ఉన్నారని.. ఇది కేవలం 9.5 శాతమేనని తెలిపింది. దీంతో లింగ వివక్షకు చోటివ్వకుండా స్త్రీలకు తగిన సంఖ్యలో ప్రాధాన్యం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Similar News

News January 11, 2026

నిరసనల్లో పాల్గొంటే మరణ శిక్ష: ఇరాన్

image

నిరసనల్లో పాల్గొంటే దేవుడి శత్రువుగా భావిస్తామని ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. దేశ చట్టాల ప్రకారం మరణశిక్ష అభియోగాలు తప్పవని అటార్నీ జనరల్ ఆజాద్ హెచ్చరించారు. అల్లర్లు చేసే వారికి సాయం చేసినా ఇదే శిక్ష తప్పదని చెప్పారు. ఇప్పటిదాకా 2,300 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నిరసనలను <<18818974>>తీవ్రం చేయాలని<<>> ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ పిలుపునివ్వడం తెలిసిందే.

News January 11, 2026

WPL: ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

image

WPLలో తన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74*), నాట్ స్కీవర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబడింది. 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది.

News January 11, 2026

నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్

image

గ్రేటర్ నోయిడాలో (UP) జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్స్‌ సాధించారు. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్.. 2023 ప్రపంచ ఛాంపియన్ నితూ ఘాంగాస్‌ను ఓడించి తన మూడో నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. మరోవైపు హుసాముద్దీన్ 60KGల విభాగంలో సచిన్ సివాచ్‌పై విజయం సాధించారు. 75KGల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ సైతం గోల్డ్ మెడల్ సాధించారు.