News April 3, 2025
మగాళ్ల కంటే ఆడవారికే వినికిడి శక్తి ఎక్కువ!

మగాళ్లతో పోలిస్తే మహిళలకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని ఓ రీసెర్చ్లో తేలింది. ఏ ప్రాంతమైనా, వయస్సుల్లో తేడాలు ఉన్నా అతివలే అన్ని రకాల శబ్దాలు మెరుగ్గా వింటారని వివరించింది. పురుషులు, మహిళల మధ్య ఈ తేడా 2 డెసిబుల్స్ వరకు ఉంటుందని పేర్కొంది. ఆడవారి చెవి నిర్మాణంలోని సూక్ష్మమైన తేడాల వల్ల ఇది సాధ్యమైనట్లు రీసెర్చ్ వెల్లడించింది. అలాగే ఎడమ చెవి కంటే కుడి చెవి సున్నితంగా ఉంటుందని చెప్పింది.
Similar News
News January 21, 2026
FLASH: పెరిగిన వెండి ధర

ఇవాళ ఉదయం నుంచి తటస్థంగా ఉన్న వెండి ధర మధ్యాహ్నం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.3,45,000కు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,474గా ఉంది.
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.
News January 21, 2026
APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<


