News February 10, 2025

30 ఏళ్లు దాటిన మహిళలు ఈ పరీక్షలు చేసుకోవాలి!

image

1. మామోగ్రఫీ- దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించవచ్చు. 2.పాప్ స్మియర్ టెస్ట్ – గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించవచ్చు. 3.కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC)- రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను దీని ద్వారా గుర్తించవచ్చు. 4. థైరాయిడ్ 5. విటమిన్ -D, కాల్షియం టెస్ట్. ఈ పరీక్షలు చేయించుకొని దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News January 21, 2026

కొనసాగిన నష్టాలు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకొని చివరికి 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద సెటిల్ అయింది.

News January 21, 2026

అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.

News January 21, 2026

గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

image

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.