News September 12, 2025
మహిళలూ వీటి గురించి తెలుసుకోండి

ప్రస్తుతకాలంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరిగింది. వచ్చే జీతం నుంచి సంపదని సృష్టించడం నేర్చుకోవాలి. సిప్, మ్యూచువల్ ఫండ్స్ గురించి బ్యాంకుకు వెళ్లి అడిగితే వాళ్లే వివరాలిస్తారు. గోల్డ్ బాండ్స్ కొని చూడండి. కొంతకాలానికి వడ్డీ వస్తుంది. ఆరోగ్య, జీవిత బీమాలు తీసుకోండి. భవిష్యత్తుకు తగ్గట్లు ప్రణాళికలు, ఉద్యోగంలో ఎదిగే అవకాశాలు చూడాలి. ప్రస్తుత ఉద్యోగం కాకుండా మరో ఆదాయ వనరు గురించీ ఆలోచించాలి.
Similar News
News September 12, 2025
రాష్ట్రంలో మరోసారి కుల గణన: సిద్దరామయ్య

కర్ణాటకలో మరోసారి కుల గణన చేయాల్సిన అవసరం ఉందని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ‘సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా మరోసారి సర్వే నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ గణన జరుగుతుంది. 2015లో నిర్వహించిన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఆమోదించలేదు. పదేళ్లు గడిచిపోయాయి. తాజాగా మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన సామాజిక న్యాయం దక్కాలి’ అని తెలిపారు.
News September 12, 2025
రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్

AP: యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని 1.43 కోట్ల BPL కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. APL (Above poverty line) ఫ్యామిలీలకు రూ.2.50 లక్షల వరకు ఫ్రీ వైద్యం అందుతుందన్నారు. ఈ విధానంలో ప్రభుత్వం ముందే ప్రీమియం చెల్లిస్తుందని, నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యసేవలను నిలిపివేసే అవకాశం ఉండదని Way2News కాన్క్లేవ్లో వివరించారు.
News September 12, 2025
సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

TG: రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్ 15 నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికే ప్రకటించింది. దీనిపై ఇవాళ ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తోంది. సానుకూల నిర్ణయం రాకపోతే కాలేజీలు మూతబడే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్, డిగ్రీ కాలేజీలు సైతం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.