News November 25, 2024

Women Tax Payers: ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువ

image

ఆదాయ ప‌న్ను చెల్లించే మ‌హిళ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కంటే తెలంగాణ‌లో అధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఏపీ నుంచి 6.53 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ప‌న్ను చెల్లించారు. అదే తెలంగాణలో 8.55 ల‌క్ష‌ల మంది ప‌న్ను చెల్లించిన‌ట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గ‌త ఐదేళ్ల గ‌ణాంకాలు తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే మ‌హిళ‌లు తెలంగాణ‌లో అధికంగా ఉన్న‌ట్టు నివేదిక వెల్ల‌డించింది.

Similar News

News November 9, 2025

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News November 9, 2025

కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.

News November 9, 2025

లాంచీలో శ్రీశైలం యాత్ర

image

TG: కృష్ణా నదిలో నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్(D) సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర పున:ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక 9AMకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ అందిస్తారు. వన్ సైడ్ జర్నీకి పెద్దలకు ₹2000, పిల్లలకు ₹1600 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/లో చూడగలరు.