News March 15, 2025
రోజూ డ్రింక్స్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ ముప్పు: అధ్యయనం

రోజూ కనీసం ఒక డ్రింక్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు ఐదింతలు ఎక్కువని USలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్’ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘డ్రింక్స్ తాగే యువతుల్లో ధూమ, మద్యపాన అలవాట్లు లేకపోయినా నోటి క్యాన్సర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 3.55 లక్షలమందికి నోటి క్యాన్సర్ సోకింది. వీరిలో ఎక్కువగా యువతులే ఉండటం ఆందోళనకరం’ అని తమ నివేదికలో వారు తెలిపారు.
Similar News
News March 15, 2025
జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?

నిన్న పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, త్రిభాషా విధానం, బంగ్లాదేశ్, పాకిస్థాన్లో హిందువులపై దాడులు, గోద్రా మారణహోమంపై జనసేనాని మాట్లాడారు. తాను మహారాష్ట్ర, హరియాణాకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘనస్వాగతం లభించిందని పేర్కొన్నారు. పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?
News March 15, 2025
ALERT: ఇవాళే లాస్ట్డేట్ లేదంటే పెనాల్టీ..

FY24-25కి గాను అడ్వాన్స్ ట్యాక్స్ ఆఖరి ఇన్స్టాల్మెంట్ చెల్లించేందుకు MAR 15 చివరి తేదీ. IT చట్టం ప్రకారం ఒక FYలో అంచనా వేసిన పన్ను రూ.10,000 దాటితే ముందస్తుగా చెల్లించాలి. ఉద్యోగులకైతే కంపెనీలు TDS/TCS కత్తిరిస్తాయి. కొందరికి FD, MF, షేర్లు, ఇతర పెట్టుబడుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. వారు JUNE, SEP, DEC, MAR 15లోపు 4 విడతల్లో 15, 45, 75, 100%లోపు పన్ను చెల్లించాలి. లేదంటే 1%/M పెనాల్టీ తప్పదు.
News March 15, 2025
విమానంలో వచ్చినా చెట్లను నరికేవారు: చంద్రబాబు

AP: గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లారని CM చంద్రబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం సుపరిపాలనతో దూసుకెళ్తోందని చెప్పారు. తణుకులో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గత సీఎం జగన్ ఎప్పుడూ ప్రజల్లో తిరగలేదు. ఒక వేళ వచ్చినా పరదాలు కట్టుకుని తిరిగేవారు. విమానంలో వచ్చినా కింద చెట్లను కొట్టేసేవారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడనిచ్చేవారు కాదు’ అని పేర్కొన్నారు.