News June 4, 2024

దిగ్గజ నేతలు గెలిచిన స్థానంలో మహిళ గర్జన!

image

AP: రాజకీయ హేమాహేమీలు గెలిచిన నంద్యాల లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఆమె 42,459 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆమెకు 3,00,982 ఓట్లు పోలయ్యాయి. ఆమె విజయం సాధిస్తే నంద్యాలలో నెగ్గిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. కాగా ఇక్కడ గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండు సార్లు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు.

Similar News

News December 27, 2025

₹240 కోట్లతో బాలామృతం.. నాణ్యత లోపిస్తే నష్టం

image

AP: 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు బాలామృతం కింద ₹240 CRతో న్యూట్రిషన్ పౌడర్, హెల్త్ మిక్స్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు టెండర్లు పిలిచింది. పసివారికిచ్చే ఇవి నాణ్యతగా ఉండాలి. లేకుంటే దుష్ప్రభావం చూపుతాయి. అందుకే అనుభవమున్న కంపెనీలకే దీన్ని అప్పగించాలి. అయితే రాగి పిండి, చిక్కీలు తయారీ చేసే సంస్థలకు ఇచ్చేలా రూల్ మార్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు ‘TG ఫుడ్స్’ పౌడర్ ఇస్తున్నారు.

News December 27, 2025

‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

image

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.

News December 27, 2025

18ఏళ్లైనా న్యాయం జరగలేదు: ఆయేషా పేరెంట్స్

image

AP: తమ కూతురు ఆయేషా <<10606883>>మీరా<<>> హత్య జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా ఇంకా న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సీబీఐ, సిట్ విఫలమయ్యాయని మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ కూడా సరిగ్గా చేయలేదని ఆరోపించారు. సామాన్యులకు న్యాయం జరగదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని వినతిపత్రంలో కోరారు.