News June 4, 2024

దిగ్గజ నేతలు గెలిచిన స్థానంలో మహిళ గర్జన!

image

AP: రాజకీయ హేమాహేమీలు గెలిచిన నంద్యాల లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఆమె 42,459 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆమెకు 3,00,982 ఓట్లు పోలయ్యాయి. ఆమె విజయం సాధిస్తే నంద్యాలలో నెగ్గిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. కాగా ఇక్కడ గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండు సార్లు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు.

Similar News

News February 10, 2026

రైతులకు వాట్సాప్‌లో APMIP సేవలు

image

AP: వాట్సాప్‌(మన మిత్ర)లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(APMIP)ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘రైతులు ఫోన్‌తో 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని పంపి, APMIPను ఎంపిక చేసుకోవాలి. సబ్సిడీ కోసం నమోదు, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు ఆన్‌లైన్‌లో కొని సురక్షితంగా చెల్లింపులు చేయొచ్చు’ అని తెలిపారు.

News February 10, 2026

US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

image

H-1B వీసా ప్రోగ్రామ్‌ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.

News February 10, 2026

దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

image

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్‌గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.