News February 23, 2025
రూ.4.5 కోట్ల లాటరీ తగిలింది.. కానీ

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లుగా దొంగలకు ₹4.5Cr లాటరీ తగిలింది. అయితే చోరీ చేసిన ATM కార్డుతో దాన్ని కొనడంతో అరెస్టు భయంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. లాటరీని సమంగా పంచుకునేందుకు ఒప్పుకుంటే కేసును ఉపసంహరించుకుంటానని కార్డు యజమాని ప్రకటించాడు. విజేత వస్తే డబ్బు ఇస్తామంటూ నిర్వాహకులు నిరీక్షిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి ఫ్రాన్స్లో చోటుచేసుకుంది. ఎవరూ రాకపోతే ప్రభుత్వానికి సొమ్ము వెళ్తుంది.
Similar News
News February 23, 2025
నిలకడగా ఆడుతున్న పాక్.. షకీల్ ఫిఫ్టీ

భారత్తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోగా ఆ తర్వాత వచ్చిన షకీల్(50*), రిజ్వాన్(41*) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. భారత బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు.
News February 23, 2025
మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు: షర్మిల

AP: మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రూ.26వేల కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్లలో కారం కొడుతుందని దుయ్యబట్టారు. టమాటా రైతులనూ ఆదుకోవాలన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News February 23, 2025
రేపు ఉ.10 గంటలకు..

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.