News November 25, 2024

231 ఓట్ల మెజార్టీతో గెలిచి రాజీనామాకు సిద్ధం

image

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో AJSU పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీ చీఫ్ సుదేశ్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా లేఖను ఆయనకు పంపినట్లు తెలిపారు. బీజేపీ మిత్రపక్షమైన AJSU 10 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటుకు పరిమితమైంది. కేవలం 231 సీట్ల స్వల్ప మెజార్టీతోనే నిర్మల్ మహతో గట్టెక్కడం గమనార్హం.

Similar News

News December 17, 2025

వచ్చే ఏడాదిలో అందుబాటులోకి మూడో డిస్కం

image

TG: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కం అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని కిందికి 29,05,779 వ్యవసాయం, 489 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, 1132 మిషన్ భగీరథ, 639 మున్సిపల్ వాటర్ కనెక్షన్లు వెళ్లనున్నాయి. జెన్‌కోకు చెల్లించాల్సిన రూ.26,950 కోట్లు, రూ.9,032 కోట్ల ప్రతిపాదిత రుణాలు, రూ.35,982 కోట్ల బకాయిలు ఈ డిస్కంకు మళ్లించబడతాయి. దీనికి 2వేల మంది ఉద్యోగులను కేటాయించనుంది.

News December 17, 2025

OFFICIAL: నాలుగో టీ20 రద్దు

image

IND-SA నాలుగో T20 రద్దయింది. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యం కాదని ప్రకటించారు. కాగా ఇప్పటికే జరిగిన 3 టీ20ల్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరగనుంది. కాగా లక్నోలో పొగమంచు, పొల్యూషన్ తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ రద్దు అవుతుందని గంట క్రితమే <<18596625>>Way2News అంచనా<<>> వేసింది. ఇప్పుడదే నిజమైంది.

News December 17, 2025

రిజల్ట్స్: కూతురిపై తండ్రి.. తల్లిపై కూతురు విజయం

image

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర విజయాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం(D)లోని పెనుబల్లిలో తల్లి తేజావత్‌పై కూతురు బానోతు పాపా గెలుపొందారు. నారాయణపేటలోని కోల్పూరులో కూతురిపై తండ్రి రాములు 420 ఓట్ల తేడాతో గెలుపొందారు. సొంతింటి వారే ప్రత్యర్థులుగా మారిన ఈ పోరు చర్చనీయాంశంగా మారింది. అటు ఆదిలాబాద్‌(D) బరంపూర్‌లో 69 ఏళ్ల(ఏకగ్రీవం) తర్వాత జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి దేవరావు గెలిచారు.