News November 25, 2024
231 ఓట్ల మెజార్టీతో గెలిచి రాజీనామాకు సిద్ధం

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో AJSU పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీ చీఫ్ సుదేశ్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా లేఖను ఆయనకు పంపినట్లు తెలిపారు. బీజేపీ మిత్రపక్షమైన AJSU 10 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటుకు పరిమితమైంది. కేవలం 231 సీట్ల స్వల్ప మెజార్టీతోనే నిర్మల్ మహతో గట్టెక్కడం గమనార్హం.
Similar News
News December 8, 2025
రాష్ట్రంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు: కరణ్ అదానీ

TGలో రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు బిలియనీర్ గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని గుర్తుచేశారు. అటు బెంగళూరుతో HYD పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి రేవంత్ సర్కార్ మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
News December 8, 2025
కుందేళ్ల పెంపకానికి మేలైన జాతులు

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.
News December 8, 2025
భారీ జీతంతో CSIR-CECRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<


