News November 25, 2024
231 ఓట్ల మెజార్టీతో గెలిచి రాజీనామాకు సిద్ధం

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో AJSU పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీ చీఫ్ సుదేశ్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా లేఖను ఆయనకు పంపినట్లు తెలిపారు. బీజేపీ మిత్రపక్షమైన AJSU 10 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటుకు పరిమితమైంది. కేవలం 231 సీట్ల స్వల్ప మెజార్టీతోనే నిర్మల్ మహతో గట్టెక్కడం గమనార్హం.
Similar News
News December 12, 2025
వారణాసిలో 5 గెటప్లలో మహేశ్ బాబు!

రాజమౌళి-మహేశ్ కాంబోలో రూపొందుతున్న ‘వారణాసి’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వైరలవుతోంది. మహేశ్ 5 పాత్రల్లో కన్పిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ వండర్గా, సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ అవతారాలలో హీరోను తెరపై చూపించనున్నారని టాక్ నడుస్తోంది. ‘రుద్ర’, రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి 2 గెటప్లను రివీల్ చేయగా, మిగతా 3 ఏమై ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే మహేశ్ ఫ్యాన్స్కు పండగే.
News December 12, 2025
మరణించినట్లు కలలు వస్తే.. అది దేనికి సంకేతం?

ఓ వ్యక్తికి తాను చనిపోయినట్లు పదేపదే కలలు వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి ఫలితాన్నే సూచిస్తుందని అంటున్నారు. ‘ఏదైనా సంక్షోభం లేదా మరణ ముప్పు ఇప్పటికే దాటిపోయిందని, దాని నుంచి మీరు తప్పించుకున్నారని ఈ కలలు సూచిస్తాయి. అయితే ప్రమాదానికి గురైనట్లు కలలు వస్తే దాన్ని హెచ్చరికలా భావించి జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.
News December 12, 2025
వరి నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు(2/2)

వరి నారును పొలంలో నాటేముందు కొనలు తుంచి నాటాలి. దీని వల్ల నారు కొనలలో కాండం తొలుచు పురుగు, ఇతర పురుగులు పెట్టిన గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటాలి. దీనివల్ల మొక్కల్లో పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.


