News May 10, 2024

WONDER: చంద్రుడిపై రైల్వే స్టేషన్

image

ఎవరి ఊహకూ అందని విధంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు నాసా ప్లాన్ చేస్తోంది. చంద్రుడి ఉపరితలంపై సమర్థవంతమైన రవాణా అందించేలా పూర్తిస్థాయిలో పనిచేసే మొదటి రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ రైలు భూమిపై నడిచే దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుందని తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతుండటంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 25, 2025

పిల్లల కోసం ‘బాల భరోసా’.. త్వరలో ప్రారంభం!

image

TG: ఆరోగ్య సమస్యలున్న 0-5ఏళ్లలోపు పిల్లలకు ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం ‘బాల భరోసా’ పథకాన్ని తీసుకొస్తోంది. CM రేవంత్ త్వరలో దీనిని ప్రారంభిస్తారని సమాచారం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి 42 అంశాలపై ఇంటింటి సర్వే చేశారు. 18లక్షల మంది డేటా సేకరించగా 8 లక్షల మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్సతో ఈ సమస్యల్ని పోగొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 25, 2025

ఆంజనేయుడే కాదు.. ఆయన తోక కూడా అంతే శక్తిమంతమైనది..

image

నారద పురాణం ప్రకారం.. ఆజన్మ బ్రహ్మచారి హనుమాన్ లాంగూలం(తోక) సాక్షాత్తు రుద్రుడి రూపమని చెబుతారు. అందుకే ఆయన తోకను కూడా పూజిస్తే కష్టాలు కానరాకుండా పోతాయని నమ్ముతారు. ‘పూర్వం, భీముడు కూడా ఆయన తోకను కదపలేకపోయాడు. తులసీదాస్ ‘హనుమాన్ బాహుక్’ స్తోత్రంతో హనుమ లాంగూల స్పర్శను కోరి తన బాధలను పోగొట్టుకున్నారు. లాంగూల స్తోత్ర పఠనం రోగాలు, కష్టాలను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది’ అని పండితులు చెబుతారు.

News November 25, 2025

మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్

image

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా (SM) వాడకుండా నిషేధం విధించాలని మలేషియా నిర్ణయించింది. 2026లో ఇది అమల్లోకి రానుంది. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెదిరింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పిల్లలు SM వాడితే పేరెంట్స్‌కు ఫైన్ వేయాలని భావిస్తోంది. కాగా టీనేజర్లకు DEC నుంచి SMను నిషేధిస్తామని ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండియాలోనూ ఇలాంటి రూల్ అమలు చేయాలంటారా?