News May 10, 2024
WONDER: చంద్రుడిపై రైల్వే స్టేషన్

ఎవరి ఊహకూ అందని విధంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్ను నిర్మించేందుకు నాసా ప్లాన్ చేస్తోంది. చంద్రుడి ఉపరితలంపై సమర్థవంతమైన రవాణా అందించేలా పూర్తిస్థాయిలో పనిచేసే మొదటి రైల్వే స్టేషన్ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ రైలు భూమిపై నడిచే దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుందని తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతుండటంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 12, 2026
రేపే మున్సిపల్ రిజల్ట్స్.. Way2Newsలో ఎక్స్క్లూజివ్గా..

7 కార్పొరేషన్లు.. 116 మున్సిపాలిటీలు.. సుమారు 13వేల మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. మీరెక్కడున్నా సమాచారం మీ ముందు ఉంచేందుకు Way2News సిద్ధంగా ఉంది. ప్రతి వార్డు, డివిజన్ ఫలితాలను ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా, అతివేగంగా మన యాప్లో తెలుసుకోండి.
News February 12, 2026
రష్యాలో వాట్సాప్పై నిషేధం.. టెలిగ్రామ్పై ఆంక్షలు!

వాట్సాప్ను బ్యాన్ చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. తమ చట్టాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. 100 మిలియన్ల యూజర్లను స్వదేశీ మెసెంజర్ యాప్ ‘MAX’కు మారాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే మ్యాక్స్ సర్వైలెన్స్(నిఘా) యాప్ అని ఆరోపణలు రాగా వాటిని అధికారులు ఖండించారు. ‘టెలిగ్రామ్’పైనా దశలవారీగా ఆంక్షలు విధించే యోచనలో రష్యా ఉన్నట్లు సమాచారం.
News February 12, 2026
11 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన భారత్

నమీబియాతో మ్యాచులో మరింత స్కోర్ చేయాల్సిన IND 209రన్స్కే పరిమితమైంది. ఒక దశలో 250 దాటుతుందని భావించినా ఇన్నింగ్స్ చివరి 11బంతుల్లో 5వికెట్లు కోల్పోవడంతో స్కోర్ పడిపోయింది. ఊపు మీదున్న పాండ్య 19వ ఓవర్ రెండో బాల్కు ఔట్ కాగా తర్వాతి బంతికి దూబే రనౌట్ అయ్యారు. అదే ఓవర్ చివరి బాల్కు అక్షర్ బౌల్డ్ అయ్యారు. 20వ ఓవర్ మూడో బంతికి రింకూ, చివరి బాల్కు అర్ష్దీప్ ఔటయ్యారు. 11 బాల్స్లో 4 రన్సే వచ్చాయి.


