News July 15, 2024
వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది: TCS

కొవిడ్ సమయంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోమ్ దాదాపు ముగిసిందని TCS CHRO మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు 18 నెలలుగా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని తెలిపారు. వారంలో 5 రోజులపాటు ఆఫీసుల నుంచి పనిచేసే ఉద్యోగుల సంఖ్య 70 శాతం పైనే ఉంటుందన్నారు. కాగా మిగతా దిగ్గజ కంపెనీలు కూడా సిబ్బందిని కార్యాలయాలకు రప్పిస్తున్నాయి.
Similar News
News November 28, 2025
128 మంది మృతి.. కారణమిదే!

హాంగ్కాంగ్లోని అపార్ట్మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.
News November 28, 2025
ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.
News November 28, 2025
ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.iimv.ac.in


