News March 15, 2025
22 రోజులైనా దొరకని కార్మికుల జాడ

TG: SLBC టన్నెల్లో కార్మికులు చిక్కుకుపోయి 22 రోజులైనా వారి జాడ తెలియడం లేదు. రోబోకు అనుసంధానంగా లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ యంత్రంతో రెస్క్యూ చేపడుతున్నారు. D-2 ప్లేస్లో 4 మానవ అవశేషాలు ఉన్నట్లు GPR స్కానర్ చూపినా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో అక్కడ తవ్వకాలు నిలిపేసి హై రిస్క్ ఉన్న D-1 దగ్గర తవ్వకాలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు ఒక మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.
Similar News
News March 16, 2025
మానసికంగా ధైర్యం కోల్పోయా: మంత్రి సీతక్క

TG:సోషల్ మీడియాలో తనపై పెట్టిన పోస్టులకు మానసికంగా ధైర్యం, కోల్పోయానని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పనిచేసే మహిళల ధైర్యాన్ని సోషల్ మీడియా, పోస్టులు దెబ్బ తీస్తాయన్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా ఎదుర్కొవాలి గానీ, సామాజిక మాధ్యమాలతో తప్పుడు ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ చేసిన మార్చురీ వ్యాఖ్యలు వ్యక్తిని కాదు పార్టీని ఉద్దేశించనవని మంత్రి స్పష్టం చేశారు.
News March 16, 2025
ఫెడరల్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది: స్టాలిన్

రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో పడుతుందని CMస్టాలిన్ ఆరోపించారు. విద్య, నిధుల అంశాల్లో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని అన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్ 160 సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక న్యాయవాది తమిళంలో ప్రసంగిస్తారు అనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడారు. మరొకరేమో ఆంగ్లంలో అనుకుంటే తమిళంలో ప్రసంగించారు. ఇది తమిళనాడు ఇక్కడ రెండు భాషలే ఉంటాయని తేల్చిచెప్పారు.
News March 16, 2025
అమెరికాలో తుపాను ధాటికి 16మంది మృతి

అమెరికాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకూ 16మంది మృతి చెందారు. మిస్సోరీ రాష్ట్రంలో 10మంది, అర్కన్నాస్లో ముగ్గురు మరణించగా వివిధ ప్రాంతాలలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. బలమైన గాలుల ధాటికి భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో కార్చిచ్చులు చెలరేగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో రాష్ట్రాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.