News October 20, 2024
టెస్టు జట్టులోకి వచ్చేందుకు శ్రమిస్తున్నా: శ్రేయస్

టెస్టు జట్టులోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపారు. సుదీర్ఘ ఫార్మాట్లో రాణించేందుకు ఎంతో కష్టపడుతున్నానని అన్నారు. శ్రేయస్ గతేడాది వెన్నునొప్పి నేపథ్యంలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం కోలుకుని రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్నారు. నిన్న MHపై సెంచరీ బాదారు. చాలా కాలం తర్వాత రెడ్బాల్ క్రికెట్ ఆడటం ప్రత్యేకంగా ఉందని, సెంచరీతో రిలీఫ్గా ఉందని తెలిపారు.
Similar News
News November 27, 2025
తిరుమల: 4.63 లక్షల డిప్ రిజిస్ట్రేషన్లు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన డిప్ రిజిస్ట్రేషన్కు రికార్డు స్థాయిలో భక్తులు స్పందించారు. తొలి గంటలోనే 2.16 లక్షలు నమోదు కాగా, సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 4,63,111 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు ఏపీ ప్రభుత్వ వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. డిసెంబర్ 2వ తేదీన ఈ-డిప్లో టోకెన్ పొందిన భక్తులకు ఫోన్ ద్వారా సందేశం వస్తుంది.
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


