News October 24, 2024

రూ.50 వేల కోట్లతో పనులు: చంద్రబాబు

image

AP: రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 47 పనులు కొనసాగుతున్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో కొన్నిటికి భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి. బెంగళూరు-కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 24, 2024

ప్రధాని మోదీని కలిసిన ఒమర్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. J&Kకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని J&K క్యాబినెట్ చేసిన తీర్మాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అంతకుముందు అబ్దుల్లా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. J&Kలో రహదారుల అనుసంధానాన్ని పెంచాలని కోరారు.

News October 24, 2024

రేపే ‘ఫౌజీ’ సెట్‌లోకి ప్రభాస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి హైదరాబాద్ బీహెచ్ఈఎల్‌లో జరిగే షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే వచ్చే నెల 3, 4 తేదీల్లో కూడా ఇదే సెట్‌లో ఆయన మళ్లీ షూట్‌లో పాల్గొంటారని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.

News October 24, 2024

‘బాలయ్య పండుగ’.. రేపు సెలవివ్వాలని ప్లకార్డుల ప్రదర్శన

image

సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్ షో’ సీజన్ 4 రేపటి నుంచి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో రేపు సెలవు ఇవ్వాలని ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.