News March 10, 2025

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు రాష్ట్ర అప్పులు కావు: కేంద్రం

image

అమరావతి కోసం తీసుకున్న రుణాలు AP అప్పుల పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో YCP MP అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ‘ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణం వచ్చేలా సహాయం చేశాం. ఇవి రాష్ట్ర అప్పులు కావు. రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.2,500 కోట్లు సమకూర్చాం. కౌంటర్ పార్ట్ ఫండింగ్ ద్వారా గరిష్ఠంగా రూ.1500 కోట్లు సమకూర్చాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.

Similar News

News November 18, 2025

దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

image

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.

News November 18, 2025

దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

image

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.

News November 18, 2025

జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

image

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్‌ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.