News March 10, 2025
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు రాష్ట్ర అప్పులు కావు: కేంద్రం

అమరావతి కోసం తీసుకున్న రుణాలు AP అప్పుల పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. లోక్సభలో YCP MP అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ‘ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణం వచ్చేలా సహాయం చేశాం. ఇవి రాష్ట్ర అప్పులు కావు. రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.2,500 కోట్లు సమకూర్చాం. కౌంటర్ పార్ట్ ఫండింగ్ ద్వారా గరిష్ఠంగా రూ.1500 కోట్లు సమకూర్చాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.
Similar News
News October 20, 2025
మీరు కొన్న టపాసుల హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

దీపావళి పిల్లలకు ఒక ఎమోషన్. దాచి పెట్టుకున్న డబ్బులతో పాటు పేరెంట్స్ వద్ద చిన్నపాటి యుద్ధం చేసైనా కావాల్సిన మనీ సాధించి టపాసులు కొనాల్సిందే. పండుగకు ముందు నుంచే రీల్ తుపాకులు, ఉల్లిగడ్డ బాంబులు కాలుస్తూ సంబరపడే బాల్యం దీపావళి రోజు తగ్గేదేలే అంటుంది. క్రాకర్స్ వెలుగుల్లో నవ్వులు చిందించే పిల్లల ముఖాలు చూసి పేరెంట్స్ సైతం మురిసిపోతారు. ఇంతకీ చిన్నప్పుడు మీరు కొన్న క్రాకర్స్ హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?
News October 20, 2025
దీపావళి.. లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే

ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దీపావళి. ఇవాళ లక్ష్మీపూజ, పితృదేవతలకు దివిటీ చూపించడం, దీపదానం వంటివి చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సా.7 నుంచి రా.8.30 మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి మంచి సమయమని పేర్కొంటున్నారు. ప్రదోష కాల సమయం సా.5.45-రా.8.15 మధ్య చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు.
News October 20, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.