News January 1, 2025

వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్: భారత్‌కు కాంస్యం

image

వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్-2024 ఉమెన్స్ విభాగంలో భారత ప్లేయర్ ఆర్ వైశాలి కాంస్యం గెలిచారు. క్వార్టర్స్‌లో చైనా గ్రాండ్ మాస్టర్ ఝూ జినర్‌ను ఓడించిన ఆమె, సెమీస్‌లో చైనాకు చెందిన జు వెన్జున్ చేతిలో ఓడారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ చెస్ ఆటగాడు ప్రజ్ఞానందకు వైశాలి సొంత సోదరి కావడం విశేషం. కాగా ఇదే ఛాంపియన్ షిప్‌లో ర్యాపిడ్ ఈవెంట్‌లో <<15008906>>కోనేరు హంపి<<>> టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.

Similar News

News November 28, 2025

కరీంనగర్: సర్పంచ్‌ 358.. వార్డు మెంబర్స్ 188..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి KNR జిల్లాలో మొదటి విడతలో 398 గ్రామపంచాయతీలకు 3682 వార్డు సభ్యులకు EC ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మొదటి రోజు JGTL జిల్లాలో సర్పంచ్ కు 48, వార్డు సభ్యులకు 33, KNR జిల్లాలో సర్పంచ్ కి 92, వార్డు సభ్యులకు 86, పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ కి 76, వార్డు సభ్యులకు 37, రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులకు 42, వార్డు సభ్యులకు 32 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News November 28, 2025

SU MBA, MCA పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో జరుగనున్న MBA, MCA విభాగంలో 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 5 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో DEC 9 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

News November 28, 2025

NZB: ఏకగ్రీవాల కోసం బలవంతం చేయకూడదు: కలెక్టర్

image

జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకాగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంభించకూడదని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. బలవంతం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహరించాలని కలెక్టర్ కోరారు.