News January 1, 2025
వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్: భారత్కు కాంస్యం

వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్-2024 ఉమెన్స్ విభాగంలో భారత ప్లేయర్ ఆర్ వైశాలి కాంస్యం గెలిచారు. క్వార్టర్స్లో చైనా గ్రాండ్ మాస్టర్ ఝూ జినర్ను ఓడించిన ఆమె, సెమీస్లో చైనాకు చెందిన జు వెన్జున్ చేతిలో ఓడారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ చెస్ ఆటగాడు ప్రజ్ఞానందకు వైశాలి సొంత సోదరి కావడం విశేషం. కాగా ఇదే ఛాంపియన్ షిప్లో ర్యాపిడ్ ఈవెంట్లో <<15008906>>కోనేరు హంపి<<>> టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News January 30, 2026
రోజుకు లక్షన్నర బ్యారెల్స్.. రష్యా నుంచి ఇండియాకు!

రష్యా నుంచి పెద్దమొత్తంలో క్రూడాయిల్ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి రోజూ సుమారు 1.5 లక్షల బ్యారెల్స్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటామని కంపెనీ చెప్పిందని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆంక్షల లిస్టులో లేని రష్యన్ కంపెనీల నుంచి రానున్న 2 నెలలు కొననుందని వెల్లడించింది. US ఆంక్షల నుంచి మినహాయింపు తీసుకుని డిసెంబర్లోనూ రష్యా క్రూడ్ను కొనిందని చెప్పింది.
News January 30, 2026
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో పోస్టులు

<
News January 30, 2026
ఫిబ్రవరి 3న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: వచ్చే నెల 3న క్యాబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక ఇష్యూలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తుండడం విశేషం.


