News August 11, 2025
భారత్లో వరల్డ్ కప్.. కౌంట్డౌన్ స్టార్ట్

భారత్లో మరో క్రికెట్ సంగ్రామానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. Sept 30న మొదలయ్యే మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి మరో 50 రోజులే ఉండటంతో నేడు ICC ట్రోఫీ టూర్ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో ICC ఛైర్మన్ జై షా, BCCI సెక్రటరీ సైకియా, మాజీ స్టార్లు యువరాజ్, మిథాలీ రాజ్, మహిళా క్రికెటర్లు హర్మన్, స్మృతి, జెమీమా పాల్గొన్నారు. కాగా టోర్నీకి అతిథ్యమివ్వనున్న అన్ని నగరాల్లో ట్రోఫీ టూర్ నిర్వహించనున్నారు.
Similar News
News August 11, 2025
షూటింగ్లు బంద్ చేయడం సరికాదు: కోమటిరెడ్డి

TG: నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో వేర్వేరుగా భేటీ అయిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షూటింగ్లు బంద్ చేయడం సరికాదని, పనిచేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కార్మికులకు సూచించారు. నిర్మాతలు కూడా కొంచెం వేతనం పెంచాలని, సమస్యను పెద్దది చేయొద్దని కోరారు. రేపు నిర్మాతలు, కార్మికులు సమావేశమై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ భేటీకి ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
News August 11, 2025
లిక్కర్ స్కాం కేసు.. సిట్ రెండో ఛార్జ్షీట్

AP: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టులో సిట్ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో దీన్ని రూపొందించి, సమర్పించింది. కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రలపై ఆధారాలను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపులు ఎవరి నుంచి తీసుకున్నారు? ఎవరికి అప్పగించారు? అనే అంశాలను సిట్ పేర్కొన్నట్లు సమాచారం.
News August 11, 2025
RCB ప్లేయర్ యశ్ దయాల్పై నిషేధం?

రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB ప్లేయర్ <<17189705>>యశ్ దయాల్<<>>పై UP క్రికెట్ అసోసియేషన్ (UPCA) నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ నెల 17 నుంచి జరగబోయే UP T20 లీగ్లో అతడు ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దయాల్ను రూ.7 లక్షలు వెచ్చించి గోరఖ్పూర్ లయన్స్ వేలంలో దక్కించుకుంది. కాగా నిషేధంపై తమకెలాంటి సమాచారం లేదని ఫ్రాంచైజీ చెబుతోంది.