News July 11, 2024

ప్రపంచ నేతలు మోదీలా ఉండాలి: నోబెల్ గ్రహీత

image

PM మోదీ చాలా ఆధ్యాత్మికమైన మనిషని నోబెల్ గ్రహీత జీలింగర్ పేర్కొన్నారు. మోదీ ఆస్ట్రియా పర్యటన సందర్భంగా జరిగిన భేటీలో క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి ఆధ్యాత్మికత వరకు ఎన్నో అంశాలను తాము చర్చించినట్లు ఆయన తెలిపారు. ‘ఇద్దరం ఎన్నో మాట్లాడుకున్నాం. ఆయనలోని స్పిరిచ్యువాలిటీని ప్రపంచ నేతలు కూడా అలవర్చుకోవాలి. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించాలి. అప్పుడే కొత్త ఐడియాలు జన్మిస్తాయి’ అని తెలిపారు.

Similar News

News December 28, 2025

శబరిమల ఆలయం మూసివేత.. రీఓపెన్ ఎప్పుడంటే?

image

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజా కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న 5PMకు ఆలయం తెరుస్తామని చెప్పింది. మరోవైపు ఇప్పటిదాకా 30 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ₹333 కోట్ల ఆదాయం టెంపుల్‌కు వచ్చింది.

News December 28, 2025

ఉక్రెయిన్ ఒప్పుకోకున్నా మా ‘లక్ష్యం’ సాధిస్తాం: పుతిన్

image

రెండు దేశాల మధ్య వివాదాన్ని శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ త్వరపడటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఇందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యేక సైనిక చర్య ద్వారా బలవంతంగానైనా అన్ని లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు. 500 డ్రోన్లు, 40 మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కమాండ్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా సైనిక దుస్తుల్లో పుతిన్ కనిపించారు.

News December 28, 2025

బుల్డోజర్ వివాదం.. సీఎం Vs సీఎం

image

బెంగళూరులో ఇళ్ల కూల్చివేత కర్ణాటక, కేరళ CMల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ‘నార్త్ బుల్డోజర్ జస్టిస్’ను కర్ణాటక అనుసరిస్తోందని కేరళ CM విజయన్ ఆరోపించారు. ముస్లిం ఇళ్ల కూల్చివేతలు మైనారిటీ వ్యతిరేక రాజకీయాలకు ఉదాహరణని మండిపడ్డారు. ‘ఆయనవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు. వాస్తవ పరిస్థితిపై అవగాహన లేకుండా మాట్లాడారు. బుల్డోజర్ న్యాయానికి, ఆక్రమణల తొలగింపునకు తేడా ఉంది’ KA CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు.