News July 11, 2024
ప్రపంచ నేతలు మోదీలా ఉండాలి: నోబెల్ గ్రహీత

PM మోదీ చాలా ఆధ్యాత్మికమైన మనిషని నోబెల్ గ్రహీత జీలింగర్ పేర్కొన్నారు. మోదీ ఆస్ట్రియా పర్యటన సందర్భంగా జరిగిన భేటీలో క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి ఆధ్యాత్మికత వరకు ఎన్నో అంశాలను తాము చర్చించినట్లు ఆయన తెలిపారు. ‘ఇద్దరం ఎన్నో మాట్లాడుకున్నాం. ఆయనలోని స్పిరిచ్యువాలిటీని ప్రపంచ నేతలు కూడా అలవర్చుకోవాలి. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించాలి. అప్పుడే కొత్త ఐడియాలు జన్మిస్తాయి’ అని తెలిపారు.
Similar News
News January 2, 2026
త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్లో ఉండే AEలకు ల్యాప్టాప్లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.
News January 2, 2026
కృష్ణ వర్ణం – అనంత ఆరోగ్య సంకేతం

కృష్ణుడి నీలిరంగు అనంతమైన ఆకాశానికి, అగాధమైన సముద్రానికి ప్రతీక. ఆయన వ్యక్తిత్వంలోని లోతును, ధైర్యాన్ని ఈ రంగు సూచిస్తుంది. శ్రీకృష్ణుడు ధరించిన ఈ నీలి రంగును చూస్తే మెదడులో ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ రంగు గుండె వేగాన్ని నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తుందట. మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందట. నీలి రంగు ఈ విశ్వంలో ప్రాణవాయువుకు చిహ్నం.
News January 2, 2026
ఏడాదిలో 166 పులుల మృత్యువాత

2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్గా పేరుపొందిన మధ్యప్రదేశ్లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయి. ‘టైగర్స్ జనాభా సంతృప్తస్థాయికి చేరుకుంది. టెర్రిటరీల ఏర్పాటులో అవి ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో గొడవ పడి చనిపోతున్నాయి’ అని వన్యప్రాణి నిపుణుడు జైరాం శుక్లా తెలిపారు.


