News July 11, 2024

ప్రపంచ నేతలు మోదీలా ఉండాలి: నోబెల్ గ్రహీత

image

PM మోదీ చాలా ఆధ్యాత్మికమైన మనిషని నోబెల్ గ్రహీత జీలింగర్ పేర్కొన్నారు. మోదీ ఆస్ట్రియా పర్యటన సందర్భంగా జరిగిన భేటీలో క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి ఆధ్యాత్మికత వరకు ఎన్నో అంశాలను తాము చర్చించినట్లు ఆయన తెలిపారు. ‘ఇద్దరం ఎన్నో మాట్లాడుకున్నాం. ఆయనలోని స్పిరిచ్యువాలిటీని ప్రపంచ నేతలు కూడా అలవర్చుకోవాలి. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించాలి. అప్పుడే కొత్త ఐడియాలు జన్మిస్తాయి’ అని తెలిపారు.

Similar News

News January 7, 2026

మన దగ్గరా అవకాడోను సాగు చేయొచ్చు

image

‘అవకాడో’ .. బ్రెజిల్, సెంట్రల్‌ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు మనదేశంలోనూ పండుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీర ప్రాంతాలు వీటి సాగుకు అనుకూలమంటున్నారు శాస్త్రవేత్తలు. ఉద్యాన పంటల్లో భాగంగా అవకాడోను సాగుచేసి లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు. విత్తనం నుంచి పెరిగిన అవకాడో చెట్ల పండ్లను ఉత్పత్తి చేయడానికి 4-6 ఏళ్లు పడుతుంది, అయితే అంటుకట్టిన మొక్కలు 1-2 ఏళ్లలో ఫలాలను ఉత్పత్తి చేస్తాయి.

News January 7, 2026

మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్.. ఏది బెటర్?

image

ఈ ప్రశ్న తరచూ వినిపిస్తుంటుంది. నిజానికి రెండూ బెటరే. ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌(FD)తో ఓ గ్యారంటీ, కంఫర్ట్ ఉంటుంది. నిర్ణీత వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయంలో డబ్బు అందుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్(MF)ను పెద్ద కంపెనీల్లో పెట్టుబడిగా పెడతారు. దీంతో దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుతాయి. FD స్క్రూడ్రైవర్ లాంటిదైతే, MF పవర్ డ్రిల్ లాంటిదని నిపుణులు చెబుతారు. రిటర్న్స్, ట్యాక్స్ వంటి విషయాల్లో MF బెటర్ ఆప్షన్.

News January 7, 2026

పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

image

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్‌ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్‌ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.