News April 27, 2024
సిక్సర్లలో ప్రపంచ రికార్డు

నిన్న KKR-PBKS మ్యాచ్లో సిక్సుల వర్షం కురిసింది. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 42 సిక్సులు బాదారు. మెన్స్ టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఇవి అత్యధికం కావడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో SRHvsMI(38), RCBvsSRH(38), బల్ఖ్ లెజెండ్స్vsకాబుల్ జ్వానన్(37) మ్యాచ్లు ఉన్నాయి. అలాగే ఒక ఇన్నింగ్సులో ఎక్కువ సిక్సులు(24) కొట్టిన రెండో జట్టుగా PBKS నిలిచింది. మంగోలియాపై నేపాల్ అత్యధికంగా 26 సిక్సులు బాదింది.
Similar News
News January 8, 2026
పరకామణిలో సంస్కరణల రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి

AP: <<18777180>>పరకామణిలో సంస్కరణల<<>>పై TTD ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల లెక్కింపునకు మెరుగైన ప్లాన్స్తో రావాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం కిందికి వచ్చే నిందితుడు రవికుమార్, ఆయన ఫ్యామిలీకి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని తెలిపింది. AVSO సతీశ్ మృతిపై విచారణ వేగవంతం చేయాలని చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీకి సూచించింది.
News January 8, 2026
భూమిని కాపాడేందుకు ఈ చిన్న పని చేద్దాం!

మనలోని చిన్నమార్పు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వయంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడం ద్వారా లక్షల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్ను అరికట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10లక్షలకు పైగా ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయిస్తే అందులో 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతాయి. మిగిలినవి సముద్రాలను, భూమిని కలుషితం చేస్తున్నాయి. అందుకే స్టీల్ లేదా మళ్లీ వాడగలిగే బాటిళ్లనే క్యారీ చేయండి. SHARE IT
News January 8, 2026
CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని: జగన్

AP: రాజధాని అమరావతిని రివర్ బేసిన్లో నిర్మిస్తున్నారని జగన్ అన్నారు. ‘అమరావతి నిర్మాణంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలి. నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతిస్తారా? అమరావతిలో రాజధాని కట్టకూడదు. గుంటూరు-విజయవాడ మధ్య కడితే బాగుంటుంది. అసలు రాజధానే లేని చోట చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని’ అని మీడియాతో పేర్కొన్నారు.


