News March 28, 2025
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏపీ ప్రొఫెసర్

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.
Similar News
News January 7, 2026
ఏడాది లోపు పిల్లలకు కొబ్బరి నీరు ఇవ్వొచ్చా?

6 నెలలు దాటిన తర్వాత పిల్లలకు కొబ్బరి నీటిని చాలా తక్కువ పరిమాణంలో 1, 2 స్పూన్లు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. తర్వాత పరిమాణాన్ని నెమ్మదిగా పెంచాలి. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన లేదా ఫ్లేవర్డ్ కొబ్బరి నీటిని అస్సలు ఇవ్వకూడదు, ఎందుకంటే వాటిలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది. గ్యాస్, అతిసారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలుంటే వారికి కొబ్బరినీరు ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు.
News January 7, 2026
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? క్లారిటీ

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. బీరు తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలు ఒత్తిడికి గురై రాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీరులోని ప్యూరిన్తో యూరిక్ యాసిడ్ పెరిగి కొత్త రాళ్లు ఏర్పడవచ్చు. మూత్రంలో ప్రెజర్ పెరిగి రాయి బ్లాడర్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.
News January 7, 2026
జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు – కలుపు నివారణ

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణకు మొదటి 20- 25 రోజులు కీలక దశ. వరికొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా లీటరు నీటికి పారక్వాట్ కలుపు మందు 5mlను కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటలలోపు తేమ గల నేలపై పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో లీటరు నీటికి క్విజాలోఫోప్ ఈథైల్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


