News May 24, 2024
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సబ్మెరైన్ గుర్తింపు

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సబ్మెరైన్ సౌత్ చైనా సముద్రంలో బయటపడింది. అమెరికాకు చెందిన ఈ జలాంతర్గామి దాదాపు 80 ఏళ్ల తర్వాత బయటపడటం విశేషం. ఫిలిప్పీన్స్ ఐలాండ్స్ దగ్గర్లో దాదాపు కి.మీ లోతులో అది ఉన్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. కాగా 1944 ఆగస్టు 29న ఈ సబ్మెరైన్పై శత్రువులు దాడి చేయడంతో సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో అందులో పని చేసే 79 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


