News July 1, 2024
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్లో ఏర్పాటు: కేంద్రమంత్రి

ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంను వచ్చే ఏడాది భారత్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇది ఫ్రాన్స్లోని లౌవ్రె మ్యూజియం కన్నా రెండింతలు పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఫ్రాన్స్తో ఒప్పందం జరిగిందని జోధ్పుర్లో మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 27, 2025
మీ ఇంట్లో ‘దక్షిణామూర్తి’ చిత్రపటం ఉందా?

శివుడి జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. ఇంట్లో ఆయన చిత్రపటం ఉంటే అది సకల శుభాలు, అష్టైశ్వర్యాలకు మార్గమని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అపమృత్యు దోషాలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఆయనను ఆరాధిస్తారు. దక్షిణామూర్తి దర్శనంతో పిల్లల్లో విద్యా బుద్ధులు వికసించి, జ్ఞానం, ఏకాగ్రత సిద్ధిస్తాయని నమ్మకం.
☞ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 27, 2025
TGTET-2026.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

TGTET-2026కు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. D.EL.Ed, B.EL.Ed, D.Ed, B.Ed, B.A.Ed / B.Sc.Ed కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1-8వ తరగతి వరకు బోధించడానికి టెట్ అర్హత తప్పనిసరి. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఒకసారి టెట్ ఉత్తీర్ణులైతే లైఫ్టైమ్ వాలిడిటీ ఉంటుంది. వెబ్సైట్: https://tgtet.aptonline.in/tgtet/
News November 27, 2025
దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలి?

దక్షిణామూర్తి చిత్రపటాన్నిగురువారం రోజున ఇంట్లో ప్రతిష్ఠిస్తే సకల శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గురు గ్రహ ప్రభావం అధికంగా ఉండే ఈరోజున జ్ఞాన స్వరూపుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విద్యాభివృద్ధి పెరుగుతుందని అంటున్నారు. ‘శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పండుగ రోజులలో విగ్రహ స్థాపన చేయవచ్చు. నిష్ణాతులైన పండితుల సలహా మేరకు ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరం’ అని చెబుతున్నారు.


