News November 22, 2024
బియ్యంలో పురుగులు.. ఇలా చేస్తే దరిచేరవు!

ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళనకరం. ఈ నేపథ్యంలో బియ్యంలో పురుగులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చిట్కాలను పలువురు సూచిస్తున్నారు. బియ్యం నిల్వ ఉంచే డబ్బాల్లో ఘాటైన వాసన ఉండేవాటిని వేయాలని చెబుతున్నారు. వేపాకు, బిరియానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, రాతి ఉప్పు పొట్లాలను వాటిలో ఉంచాలని చెబుతున్నారు.
Similar News
News January 12, 2026
కొనసాగుతున్న రూపాయి పతనం

ఈ వారం మార్కెట్ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
News January 12, 2026
స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. కారణాలివే

నేడు స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభం నుంచే భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. 1. ట్రంప్ సర్కార్ భారత్పై భారీగా సుంకాలు విధిస్తుందన్న భయాలు. 2. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం. 3.TCS వంటి బడా కంపెనీల Q3 ఫలితాలపై ఆందోళన. 4. ఇరాన్ అల్లర్లు సహా అంతర్జాతీయ ఉద్రిక్తతలు.
News January 12, 2026
‘ఈ-ఫార్ములా’ కేసులో మరిన్ని వివరాలు కోరిన కేంద్రం

TG: E-ఫార్ములా కేసులో IAS అధికారి అరవింద్కుమార్ ప్రాసిక్యూషన్కు అనుమతివ్వాలని కేంద్రాన్ని GOVT DECలో కోరింది. విదేశీ కంపెనీకి ₹55Cr విడుదల చేయడంలో ఆయన పాత్ర ఉందని నివేదించింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని కేంద్రం తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. IASపై వచ్చిన అభియోగాలు నిజమో కాదో తేలిన తరువాతే నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రం అందించే సమాచారం సంతృప్తికరంగా ఉంటే అనుమతిస్తుంది.


