News March 28, 2024
ఘోరం.. పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదని పొడిచేశారు

మహారాష్ట్రలోని భివండీలో దారుణ ఘటన జరిగింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదనే కారణంతో ఓ విద్యార్థిపై ముగ్గురు క్లాస్మేట్స్ దాడి చేశారు. తర్వాత కత్తితో పొడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 17, 2026
ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసిన ఇండియా!

ఇరాన్కు చెందిన 3 ఆయిల్ ట్యాంకర్లను ఇటీవల ముంబై తీరంలో ఇండియా స్వాధీనం చేసుకుందని Reuters వెల్లడించింది. వీటిపై US ఆంక్షలు ఉన్నట్లు చెప్పింది. ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు, ట్రాకింగ్కు దొరక్కుండా, ఐడెంటిటీ తెలియకుండా చేసే షిప్-టు-షిప్ ట్రాన్స్ఫర్స్కు తమ జలాలను ఎవరూ ఉపయోగించకూడదని ఇండియా కోరుకుంటోందని పేర్కొంది. ఈ నౌకలు తరచూ గుర్తింపు మార్చుకుంటాయని, వాటి ఓనర్లు విదేశాల్లో ఉన్నారని తెలిపింది.
News February 17, 2026
కుక్కలా నడుస్తుంది.. ఇంజినీర్లా ఆలోచిస్తుంది..

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో రోబో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. TCS అభివృద్ధి చేసిన ఈ రోబో కుక్కలా నడుస్తుంది. ఇంజినీర్లా ఆలోచిస్తుంది. రిస్కీ ప్రాంతాల్లో ప్రమాదాలు, తప్పిదాలను నివారించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమస్యలను, గ్యాస్ లీకేజ్, వెల్డింగ్ లోపాలనూ గుర్తించగలదు. కష్టతరమైన జోన్లలోనూ పని చేస్తుందట.
News February 17, 2026
శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.


