News January 27, 2025

బ్రేక్ ఫాస్ట్‌లో ఏదో ఒకటి తినేద్దాం అనుకుంటున్నారా?

image

ఉదయం పూట కొందరు పని హడావుడిలో ఏదో ఒకటి తినేసి వెళ్తుంటారు. కానీ రోజంతా ఉత్సాహాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన బ్రెడ్, అటుకులు, ఓట్ మీల్ వంటివి తీసుకోవాలి. గుడ్లు, పెరుగు వంటితోపాటు పీచు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, ఆమ్లెట్, బాదం, అక్రోట్, సోయాపాలు, కాయగూరలు తినాలి. నూనెలో ముంచి తీసే పూరీ, వడ, బోండాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.

Similar News

News November 13, 2025

వచ్చే ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

image

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేసి, డెయిరీ ఫామ్‌ను విస్తరించి వచ్చే ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

News November 13, 2025

మరికాసేపట్లో పెద్ద ప్రకటన: లోకేశ్

image

AP: ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు మంత్రి లోకేశ్ Xలో పోస్టు చేశారు. 2019 నుంచి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తుఫానులా తిరిగివస్తోందన్నారు. ఆ కంపెనీ ఏదో 9amకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. మీరేం అనుకుంటున్నారు?

News November 13, 2025

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు పావుకేజీ రూ.30కి తక్కువ లభించడం లేదు. అంటే కేజీ రూ.100-120 పలుకుతోంది. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్‌తో పంటలు తీవ్రంగా దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీరూ కూరగాయల రేట్లతో షాక్ అయ్యారా?