News March 14, 2025

WOW.. గ్రూప్స్‌లో సత్తాచాటిన సిద్దిపేట బ్రదర్స్

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతుల కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నోడు హరికృష్ణ గ్రూప్‌-2లో 184 ర్యాంక్ సాధించారు.

Similar News

News November 21, 2025

విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

image

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్‌ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.

News November 21, 2025

సంగారెడ్డి: హోంగార్డుల సంక్షేమానికి భరోసా: ఎస్పీ

image

హోంగార్డుల సంక్షేమానికి భరోసా కల్పిస్తామని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరిధి మైదానంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. శాలరీ అకౌంట్ ఉన్న హోంగార్డు మరణిస్తే రూ.40 లక్షల వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

News November 21, 2025

BREAKING: భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్

image

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏడీసీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడే ఎస్పీగా ప్రమోట్ అవ్వగా, నేడు జరిగిన బదిలీల్లో భూపాలపల్లి ఎస్పీగా నియామకమయ్యారు. కాగా 2023 వరదల సహాయక చర్యల్లో సిరిశెట్టి సంకీర్త్‌కు మంచి గుర్తింపు వచ్చింది.