News March 30, 2024

WOW.. వెయ్యి గంటల్లో రామప్ప ఆలయాన్ని నిర్మించారు

image

WGL కిట్స్ కళాశాలలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఓ అద్భుతం సృష్టించారు. వెయ్యి గంటల్లో సరికొత్త 3డీ సాంకేతికతతో ఆలయాన్ని అచ్చు గుద్దినట్లు నిర్మించారు. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రూపేశ్‌కుమార్, అభినయ్, గౌస్‌లు ఈ దీన్ని తయారు చేయగా.. రాజనరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, సమీర్‌లు మెంటార్లుగా వ్యవహరించారు. ఐఐటీ HYD వారు నిర్వహించిన ఓ పోటీలో పాల్గొనేందుకు దీన్ని యంత్రంతో ముద్రించారు.

Similar News

News October 22, 2025

హనుమకొండలో ధాన్యం అక్రమాలు

image

HNK జిల్లా శాయంపేట, కాట్రపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నారు. వీవోఏ బలభద్ర హైమావతి, అల్లె అనితలు మిల్లర్‌తో కలసి కోట్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడ్డాయి. ఈ కేసులో 21 మందిపై శాయంపేట స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వీవోఏలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శాఖా చర్యలతో విధుల నుంచి తొలగించి, సీసీలకు నోటీసులు ఇచ్చారు.

News October 22, 2025

వరంగల్‌లో నకిలీ ఏసీబీ మోసం

image

గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఆర్టీఏ ఎంవీఐల నుంచి దశల వారీగా రూ.10.20 లక్షలు కాజేశారు. ఫోన్లలో నకిలీ బెదిరింపులు చేయడంతో ఓ ఎంవీఐకు అనుమానం రావడంతో వెంటనే WGL ఏసీబీ డీఎస్సీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో నిజం తెలిసింది. ఆర్టీఏ అధికారులు మోసపోయిన వివరాలు గుట్టుగా ఉంచాలని ప్రయత్నించగా, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను వెతికే పనిలో పడ్డారు.

News October 22, 2025

వరంగల్: ప్లాస్టిక్ సంచుల్లో పత్తి నిల్వ చేయొద్దు

image

పంట చేలలో పత్తి ఏరిన రైతులు ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి అనంతరం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారని, ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయడం ద్వారా సంచుల దారాలు పత్తిలో ఇరుక్కుపోయి నాణ్యత తగ్గిపోతుందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. పత్తి ఏరిన సమయంలో బట్ట సంచులు లేదా చీరల్లో పత్తిని నిల్వ చేయాలని సూచించారు. సంచిలో పత్తి ఎక్కువ పట్టాలని కుక్కి తీసుకు వస్తారని, అలా కూడా చేయకూడదన్నారు.