News March 31, 2025

WOW: జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ విద్యార్థిని

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కర్ని (ZPHS) పాఠశాల విద్యార్థిని వై.శశిరేఖ 57వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పీడీ బి.రూప తెలిపారు. జనవరి 9, 10, 11న వరంగల్ జిల్లాలోని గీసుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఒడిశాలోని పూరిలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే టోర్నీలో పాల్గొననున్నారు. దీంతో పాఠశాల హెచ్ఎం వెంకటయ్య,ఉపాధ్యాయులు అభినందించారు. CONGRATS❤

Similar News

News April 1, 2025

NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

image

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.

News April 1, 2025

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన జడ్చర్ల మండలంలో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల జిల్లా ధరూరు మం. మార్లవీడుకి చెందిన కిశోర్(45) వ్యాపారం చేసుకుంటూ HYDలో నివాసముంటున్నారు. సోమవారం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి తన భార్య పవిత్ర, కుమార్తె శిరీషలతో కలిసి HYD నుంచి జడ్చర్ల మీదుగా వెళ్తున్నారు. మల్లెబోయిన్పల్లి దగ్గర కారు బోల్తా పడటంతో కిశోర్‌కు తీవ్రగాయాలై మృతిచెందారు.

News April 1, 2025

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కిడ్నాప్ కలకలం

image

MBNR జిల్లాలో నిన్న బాలుడి కిడ్నాప్‌యత్నం కలకలం సృష్టించింది. స్థానికుల వివరాలు.. మిడ్జిల్ మం. వేములకి చెందిన రాజేందర్‌గౌడ్ కుమారుడు రుద్రాన్ష్ నిన్న రాత్రి ఒక్కసారిగా కనిపించకుండాపోయాడు. అదే గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి బాలుడితో వాడియాల స్టేజీ దగ్గర కనిపించినట్లు గ్రామస్థులు సమాచారమందించారు. అక్కడికెళ్లి రామస్వామిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!