News September 8, 2024

WOW.. జగిత్యాల జిల్లాలో 52 ఫీట్ల మట్టి గణపతి!

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో సాయిబాబా ఆలయం పక్కన 52 ఫీట్ల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రతిష్ఠాపన పూజలో MLA సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 11 రోజుల పూజల అనంతరం మండపం వద్దనే నీళ్లతో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, KNRలో భారీ గణపతులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 6, 2024

నంది గరతుమంతుడి వాహనంపై ఊరేగిన రాజన్న

image

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలలో భాగంగా ఆదివారంరాత్రి స్వామి నంది గరుత్మంతుడి వాహనంపై విహరించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.

News October 6, 2024

కరీంనగర్: 21 ఆసుపత్రులకు గుర్తింపు

image

కరీంనగర్ జిల్లాలో 21 ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లాలో అందుతున్న ఆరోగ్య సేవలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. ఇందులో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కాయకల్పకు ఎంపిక కావడం జరిగింది. మోతాజాఖానా పట్టణ ఆరోగ్య కేంద్రంకు బెస్ట్ అవార్డు, బుట్టిరాజారాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం కమండేషన్ విభాగంలో కాయకల్ప గుర్తింపు దక్కించుకొని అవార్డుకు ఎంపికైంది.

News October 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల, సిరిసిల్ల కలెక్టరేట్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాక జయంతి వేడుకలు.
@ కథలాపూర్ మండలంలో హత్యకు పాల్పడిన నిందితుడి అరెస్ట్.
@ కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థల పరిశీలన.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలు.
@ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనును కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్.