News February 16, 2025
WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739640647865_1226-normal-WIFI.webp)
ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.
Similar News
News February 19, 2025
మాజీ క్రికెటర్ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739941705845_653-normal-WIFI.webp)
ఫస్ట్ క్లాస్ క్రికెటర్, ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ రేగే(76) కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూశారు. సునీల్ గవాస్కర్కు ఆయన అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం మిలింద్ MCAకు అడ్వైజర్గా ఉన్నారు. 26 ఏళ్ల వయసప్పుడే హార్ట్ ఎటాక్కు గురైన ఆయన అప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మిలింద్ ముంబై తరఫున 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 126 వికెట్లు పడగొట్టారు. ఆయన మరణంతో MCA విషాదంలో మునిగిపోయింది.
News February 19, 2025
2027లో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా రిలీజ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739942148538_746-normal-WIFI.webp)
ఛత్రపతి శివాజీ జీవితంపై ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే సినిమా తెరకెక్కనుంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తుండగా సందీప్ సింగ్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. శివాజీ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవితంపై తెరకెక్కిన ‘ఛావా’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
News February 19, 2025
అదానీపై కేసులో భారత్ సాయం కోరిన అమెరికా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252505868_1199-normal-WIFI.webp)
గౌతమ్ అదానీ, సాగర్ అదానీపై లంచం కేసులో ఇన్వెస్టిగేషన్కు సహకరించాలని భారత్ను కోరినట్టు US SEC తెలిపింది. న్యాయ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్టు న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెల్లడించింది. వారిద్దరూ అమెరికాలో లేరని, భారత్లో ఉన్నారని పేర్కొంది. గత ఏడాది గౌతమ్, సాగర్పై జో బైడెన్ నేతృత్వంలోని DOJ అభియోగాలు మోపింది. వీటిని అదానీ గ్రూప్ ఖండించిన సంగతి తెలిసిందే.