News December 15, 2024
WPL: భారీ ధర పలికిన విండీస్ ప్లేయర్

మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో వెస్టిండీస్ ప్లేయర్ డియాండ్ర డాటిన్ భారీ ధర పలికారు. వేలంలో ఆమెను రూ.1.7 కోట్లకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది. T20Iల్లో సెంచరీ చేసిన తొలి మహిళా ప్లేయర్ డాటిన్ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా ప్లేయర్ నాడిన్ డి క్లర్క్ను రూ.30 లక్షలకు ముంబై దక్కించుకుంది. పూనమ్ యాదవ్, హీథర్ నైట్, స్నేహ్ రాణా తదితర ప్లేయర్లు అన్సోల్డ్గా మిగిలారు.
Similar News
News October 20, 2025
తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదు..

చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటాం. అయితే దీని వెనక మరోకోణం కూడా ఉంది. వరాహస్వామి అంశతో భూదేవి నరకుడికి జన్మనిస్తుంది. నరకుడు బాణాసురిడి స్నేహంతో రాక్షస లక్షణాలను పొంది ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించిన భూదేవి విల్లంబులు చేతబట్టి నరకాసురుడిని వధిస్తుంది. తప్పు చేస్తే కొడుకైనా శిక్ష తప్పదని పురాణాలు చెబుతున్నాయి.
News October 20, 2025
సౌతాఫ్రికాతో టెస్టు.. రూ.60కే టికెట్

క్రికెట్ అంటే భారత్లో ఓ ఎమోషన్. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. T20ల ప్రభావమో, ఏమో టెస్టులకు ఆదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెస్టిండీస్ సిరీస్కు ప్రేక్షకుల స్పందన చూస్తే అదే అనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కోల్కతా వేదికగా (Nov 14-18) సౌతాఫ్రికాతో భారత్ తలపడే తొలి టెస్టుకు టికెట్ ప్రారంభ ధర రోజుకు రూ.60గా నిర్ణయించారు. ఇవాళ మ.12 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.
News October 20, 2025
వీరికి వారం ముందు నుంచే ‘దీపావళి’

మనం దీపావళి ఏ రోజైతే ఆరోజే వేడుకలు చేసుకుంటాం. కానీ ఛత్తీస్గఢ్లోని సెమ్రా గ్రామంలో దీపావళి వేడుకలు వారం ముందు నుంచే మొదలవుతాయి. ఈ ఆచారం వెనుక ఓ కారణం ఉంది. పూర్వం సింహం దాడిలో మరణించిన సర్దార్ దేవ్, గ్రామ పూజారి కలలోకి వచ్చి దీపావళి పండుగను ముందే జరపాలని చెప్పాడట. అలా చేయకపోతే దురదృష్టం కలుగుతుందని హెచ్చరించాడట. అప్పటి నుంచి అక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఊర్లో OCT 20నే దీపావళి మొదలైంది.