News March 4, 2025

మూడోసారి బెయిల్ పొందిన రెజ్లర్ సుశీల్ కుమార్

image

మర్డర్ కేసులో మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000 బాండు, 2 ష్యూరిటీలు ఇచ్చాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2021, మేలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌ఖడ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. దీంతో పాటు అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 2023, మార్చిలో తండ్రి అంత్యక్రియలు, జులై 23న మోకాలి ఆపరేషన్ కోసం ఆయన వారం పాటు బెయిల్ పొందడం గమనార్హం.

Similar News

News March 4, 2025

కోహ్లీ హాఫ్ సెంచరీ, అయ్యర్ ఔట్

image

ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రోహిత్, గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అయ్యర్ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, అయ్యర్ 45 పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 27 ఓవర్లలో 136/3గా ఉంది. భారత్ విజయానికి మరో 23 ఓవర్లలో 129 పరుగులు కావాలి. కోహ్లీ (51*), అక్షర్ పటేల్ (2*) క్రీజులో ఉన్నారు.

News March 4, 2025

ఇంటర్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

image

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో 5 ని.లు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల అడ్రస్ విషయంలో గందరగోళానికి గురికాకుండా హాల్‌టికెట్లపై QR కోడ్ ముద్రించామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 9240205555కు కాల్ చేయాలని సూచించారు. 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
*ALL THE BEST STUDENTS

News March 4, 2025

రెడ్ బుక్ తన పని చేసుకుంటూ వెళ్తోంది: లోకేశ్

image

TDP కార్యకర్తలు, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవ్వరినీ వదలబోమని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లినా తనను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారని, రెడ్ బుక్ తన పని అది చేసుకుంటూ వెళ్తోందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టనని గతంలోనే తాను చెప్పినట్లు వెల్లడించారు. ఎవరినైనా వదిలిపెడతాననే డౌట్ అక్కర్లేదన్నారు. దేశంలోనే ఏ పార్టీకి లేని బలం TDPకి ఉందని, కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.

error: Content is protected !!