News June 15, 2024
తెలివితో రాత మారింది.. విధి మారలేదు!

రొమేనియా వాసి, గణిత మేధావి స్టెఫాన్ మాండెల్ 1950సం.లో ఓ చిరుద్యోగి. జీతం చాలక లాటరీలపై ఫోకస్ చేసి గెలిచే ఛాన్స్ గల టికెట్లు కొనేందుకు ఓ సూత్రం కనిపెట్టాడు. దీంతో 1960-70 మధ్య 14 జాక్పాట్లతో ₹200Cr పైగా గెలిచాడు. అనంతరం సిండికేషన్ పెట్టి సభ్యులకు ఈ సలహాలిచ్చాడు. కానీ ఈ విధానంపై ప్రభుత్వం, లాటరీ సంస్థలు కోర్టులకెళ్లాయి. దీంతో న్యాయ పోరాటాలకే ఆస్తులన్నీ ఖర్చై మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాడు.
Similar News
News January 12, 2026
విజయ్పై సీబీఐ ప్రశ్నల వర్షం

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.
News January 12, 2026
గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

గోవా షిప్యార్డ్ లిమిటెడ్(<


