News March 19, 2024

విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు.. చిక్కుల్లో ఎమ్మెల్యే

image

AP: పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ చిక్కుల్లో పడ్డారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో పదో తరగతి విద్యార్థులకు తన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు.. ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు అందించారు.

Similar News

News December 11, 2025

పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర కావాల్సిందే..

image

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసికారోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.

News December 11, 2025

పరిధి దాటారు, రేపు లొంగిపోండి: సుప్రీంకోర్టు

image

తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ACP వెంకటగిరి ఎదుట 11AM లోపు లొంగిపోవాలని పేర్కొంది. SIB చీఫ్‌గా తన పరిధి దాటి వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అటు బెయిల్ రద్దుతో పాటు, 14 రోజులు ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది.

News December 11, 2025

కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న BCCI

image

వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లీల శాలరీలను BCCI తగ్గించే అవకాశముంది. ఈనెల 22న బోర్డు వార్షిక కౌన్సిల్ భేటీలో ఇద్దర్నీ A+ కేటగిరీ నుంచి Aకు మారుస్తారని సమాచారం. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ Aనుంచి A+కు ప్రమోట్ కానున్నారు. అంపైర్స్, రిఫరీల రెమ్యునరేషన్ అంశాలపైనా ఇందులో చర్చ జరగనుంది. ప్లేయర్లకు A+, A, B, C కేటగిరీలుగా బోర్డు శాలరీలు ఇస్తోంది.
A+: ₹7కోట్లు, A: ₹5కోట్లు, B: ₹3కోట్లు, C: ₹1కోటి.