News August 26, 2024

WT20 WC: ఆసీస్ టీమ్ ప్రకటన

image

అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీమ్‌ను ప్రకటించింది. అలీసా హీలీ జట్టుకు నాయకత్వం వహించనున్నారు.
జట్టు: హీలీ, డార్సీ బ్రౌన్, ఆష్ గార్డ్‌నర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినక్స్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మెగన్ షట్, సుదర్‌లాండ్, జార్జియా వారెమ్, వ్లామినెక్.

Similar News

News December 23, 2025

క్యాబినెట్ భేటీ వాయిదా

image

AP: ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. 29వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజు సీఎం అధ్యక్షతన 10.30amకు సచివాలయం మొదటి బ్లాకులో భేటీ జరగనుంది. మరోవైపు ఈ నెల 28న CM చంద్రబాబు అయోధ్య వెళ్లనున్నారు. 11.20amకు రామజన్మభూమి కాంప్లెక్స్‌కు చేరుకొని 2.30pm వరకు శ్రీరాముడిని దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లిలోని నివాసానికి తిరుగుపయనమవుతారు.

News December 23, 2025

పూజల్లో ‘వక్క’ సమర్పిస్తున్నారా?

image

‘వక్క’ అత్యంత పవిత్రమైనది. పూజలో దీనిని అఖండంగా(ముక్కలు చేయకుండా) ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. తద్వారా పూర్తి ఫలితం లభిస్తుందంటున్నారు. ‘దీన్ని దేవతలకు ప్రతీకగా భావిస్తారు. ఇది దైవంతో మనకున్న బలమైన బంధానికి, విధేయతకు చిహ్నం. ఆయుర్వేద పరంగానూ ఇది చాలా ఉపయోగకరం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలి పెంచుతుంది. యజ్ఞాల్లో తమలపాకుతో కలిపి వక్క సమర్పిస్తే కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

News December 23, 2025

నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

image

AP: వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ 4pmకు పులివెందుల చేరుకొని భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 24న ఉదయం ఇడుపులపాయకు వెళ్లి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 1pmకు మళ్లీ పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 25న 8.30amకు CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు. 10.30amకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.