News July 9, 2025

Y.S జగన్‌కు మరో పదవి

image

సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఛైర్మన్‌గా పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డిని నియమించారు. ఛైర్మన్‌గా బండి రామసూరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వి.ఓబులేసును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News January 26, 2026

YVU ఫైన్ఆర్ట్స్ శాఖలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.!

image

కడప YVU పీజీ కళాశాల ఫైన్‌ఆర్ట్స్ శాఖ కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలి నియామకం కోసం ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సంప్రదించాలని సూచించారు.

News January 26, 2026

కడప జిల్లాలో నేటి PGRS రద్దు: SP.!

image

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఈనెల 26వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నందున ఈ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు గమనించి, దూర ప్రాంతాల నుంచి రాకూడదని ఆయన కోరారు. తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

News January 25, 2026

కడపలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

image

గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడప సిద్ధమైంది. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో రేపు ఉదయం 8:30 గంటలకు జాతీయ జండాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.