News November 8, 2024

యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం

image

TG: యాదాద్రి ఆలయం పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిపిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News November 19, 2025

హసీనాకు మరణశిక్ష.. కుమారుడి స్పందనిదే..

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు <<18311087>>మరణశిక్ష<<>> విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయంపై ఆమె కుమారుడు సాజిబ్ వాజీద్ స్పందించారు. కేసుల విచారణలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పుకు జో బైడెన్ సర్కారు మిలియన్ డాలర్లు వెచ్చించిందని విమర్శించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వ వైఖరి వేరుగా ఉందని సాజిబ్ అభిప్రాయపడ్డారు.

News November 19, 2025

బి.టి పత్తికి గులాబీ రంగు పురుగుతో ముప్పు

image

బి.టి పత్తిని నవంబర్, డిసెంబర్ నెలలో గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు చిన్న లార్వాలు పూమొగ్గలు, లేతకాయలకు చిన్న రంద్రాలు చేసి లోపలకి ప్రవేశిస్తాయి. పూలలోని మొగ్గలను తినేయడం వల్ల పూలు విచ్చుకోవు. కాయల లోపలి భాగాన్ని తినేయడం వల్ల కాయ ఎదగదు. అలాగే ఇవి కాయల్లోని విత్తనం లోపలి భాగాన్ని, దూదిని కొరికి తినడం వల్ల దూది నాణ్యత తగ్గి రంగు కూడా మారుతుంది. ఫలితంగా దిగుబడి, రాబడి తగ్గుతుంది.

News November 19, 2025

పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ ఎలా?

image

పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు లీటరు నీటికి థయోడికార్బ్1.5 మి.లీ (లేదా) ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. (లేదా) క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి. పత్తి పంట చివరి దశలో ఉన్నట్లైతే ఒక లీటరు నీటికి సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్ మిత్రిన్ 25% ఇసి 1.0 మి.లీ. (లేదా) థయోమిథాక్సామ్ + లామ్డా సైహలోత్రిన్ 0.4 మి.లీ. (లేదా) సైపర్మెథ్రిన్ + క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. కలిపి పిచికారి చేసుకోవాలి.