News March 29, 2024

యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

image

TG: పలు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాల వారీగా ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అత్యధికంగా నిజామాబాద్ నుంచి 6.24లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది. HYD మినహా 32 జిల్లాల్లో 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా 75.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News March 29, 2026

IPL: ముంబైపై KKR భారీ స్కోర్

image

ముంబైలోని వాంఖడే స్టేడియంలో MIతో జరిగిన మ్యాచ్‌లో రహానే, రఘువంశీ అర్ధశతకాలు బాదడంతో KKR భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది. ఓపెనర్లు రహానే(67), అలెన్(37) తొలి వికెట్‌కు 69 రన్స్ జోడించారు. ఆపై రింకూ సింగ్‌(33*)తో కలిసి రఘువంశీ(51) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. గ్రీన్ 18 పరుగులకే ఔట్ అయ్యారు. MI బౌలర్లలో శార్దూల్ 3, హార్దిక్ ఒక వికెట్ తీశారు.

News March 29, 2026

జోనితా గాంధీ ఎవరంటే?

image

‘చిచ్చుబుడ్డి’ <<19508487>>పాటలో<<>> స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ గాయని. తెలుగు, హిందీ తదితర భాషల్లో సాంగ్స్ పాడారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తొలుత SPBతో పాట పాడే అవకాశం ఆమెకు వచ్చింది. ‘కిక్-2’లోని ‘నువ్వేనువ్వే’ పాటతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. OK బంగారం, 24 తదితర సినిమాల్లో పాటలు పాడారు. ఢిల్లీలో పుట్టిన ఆమె టొరంటోలో చదువుకొని సంగీతంపై ఇష్టంతో ఇండియాకు తిరిగొచ్చారు.

News March 29, 2026

వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే?

image

ఎండ తాపాన్ని తట్టుకోవడానికి సమ్మర్‌లో కూలింగ్ వాటర్ తాగుతుంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. చల్లటి నీరు గొంతు గరగరకు కారణమవుతుంది. బాడీ వేడిగా ఉండే వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వస్తుంది. కొందరికి తలనొప్పి, అలసటగా కూడా కలిగిస్తుంది’ అని చెబుతున్నారు.