News March 29, 2024
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

TG: పలు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాల వారీగా ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అత్యధికంగా నిజామాబాద్ నుంచి 6.24లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది. HYD మినహా 32 జిల్లాల్లో 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా 75.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News January 15, 2026
జెమినీలో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్.. ఏంటిది?

యూజర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు అందించేలా జెమినీ యాప్లో ‘పర్సనల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్ను తీసుకొచ్చినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీంతో జెమినీ యాప్ను జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్తో సింక్ చేయొచ్చు. తద్వారా మన పాత ఈమెయిల్స్, ఫొటోలకు సంబంధించిన వివరాలను వెతకడం లేదా ప్లాన్లను రూపొందించడం వంటి పనులను మరింత కచ్చితంగా చేయొచ్చు. ఈ ఫీచర్ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది.
News January 15, 2026
‘జన నాయగన్’ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు సూచించింది. గతంలో U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే, CBFC సర్టిఫికెట్ క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు SCని ఆశ్రయించారు.
News January 15, 2026
మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. * వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్ చల్లితే దోమల బెడద తగ్గుతుంది. * కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది. * అన్నం విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి. * చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.


