News November 24, 2024
యశస్వీ జైస్వాల్ స్పెషల్ ఇన్నింగ్స్కు తెర

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (161) ఔటయ్యారు. మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. కాగా జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో ప్రేక్షకులు, ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కాగా భారత్ స్కోర్ ప్రస్తుతం 314/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (17*), రిషభ్ పంత్ (0*) ఉన్నారు.
Similar News
News November 13, 2025
అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు

AP: ఈ నెల 17న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న అల్లూరిలోని ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 13, 2025
ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లు.. 31మందితో జేపీసీ

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లును పరిశీలించేందుకు BJP MP అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యుల JPC ఏర్పాటైంది. ఇందులో BJP నుంచి 15 మంది, NDA పార్టీల నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించడంతో మిగతా విపక్ష పార్టీలకు చోటు దక్కింది. వీటిలో ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఎంఐఎం, వైసీపీ ఉన్నాయి.
News November 13, 2025
నానబెట్టిన మెంతులు మంచివేనా?

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.


