News March 25, 2024

YCPలోకి చిత్తూరు ZP మాజీ ఛైర్మన్

image

చిత్తూరు జడ్పీ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్య రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ కుప్పం రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్‌తో కలిసి వైసీపీలో చేరారు.

Similar News

News December 20, 2025

చౌడేపల్లి: ‘సచివాలయ సిబ్బందికి జీతాలు నిలుపుదల’

image

చౌడేపల్లె మండలం చారాల సచివాలయంలోని పలువురి సిబ్బందికి మూడు నెలల జీతాలను నిలుపుదల చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓం ప్రసాద్, కృష్ణమూర్తి, హిమబిందు, సోమశేఖర్, మహమ్మద్ ఆరీఫ్ లకు జీతాలు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే వారికి జీతాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

News December 20, 2025

చిత్తూరు: తగ్గుతున్న చెరకు సాగు

image

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ వాణిజ్య పంటగా ఉన్న చెరకు సాగు క్రమేపి తగ్గుతోంది. సాగు వ్యయం అధికమవుతుండడం, కూలీలు దొరక్క పోవడం, చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు క్రమేపి ఇతర పంటలకు మల్లుతున్నారు. సాగు చేసిన వారు తప్పనిసరిగా బెల్లం తయారు చేయాల్సి వస్తోంది. 2020లో ఉమ్మడి జిల్లాలో 9,900 హెక్టార్లలో చెరకు సాగు కాగా.. ప్రస్తుతం 6,500 హెక్టార్లలో మాత్రమే సాగులో ఉంది.

News December 20, 2025

చిత్తూరు: ‘బాలికను గర్భిణీని చేశాడు’

image

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని పోక్సో కేసులో అరెస్ట్ చేసినట్టు నగిరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ తెలిపారు. వెదురుకుప్పం మండలంలోని 14 ఏళ్ల బాలికపై మురళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో గర్భం అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.