News March 25, 2024
YCPలోకి చిత్తూరు ZP మాజీ ఛైర్మన్
చిత్తూరు జడ్పీ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్య రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ కుప్పం రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్తో కలిసి వైసీపీలో చేరారు.
Similar News
News October 6, 2024
తిరుపతి: బాలికతో అసభ్యకర ప్రవర్తన
తిరుపతి రూరల్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలానికి చెందిన ప్రసాద్(50) కొంతకాలంగా తిరుపతి(R)లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉంటున్న 3వ తరగతి బాలికకు ఫోనులో అశ్లీల చిత్రాలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు చితకబాది MRపల్లి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News October 5, 2024
సీఎం చంద్రబాబుకు వీడ్కోలు
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగించుకొని శనివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగుపయనమయ్యారు. ఆయనకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య తదితరులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 5, 2024
వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన చంద్రబాబు
తిరుమల పాంచజన్యం వెనుక నూతనంగా నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్లతో ఈ భవనం నిర్మించారు. 1.20 లక్షల మంది భక్తులకు సరిపడే విధంగా భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.