News November 7, 2024

YCP అధినేత జగన్‌తో కాకాణి భేటీ

image

YCP అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇందులో భాగంగా వారు జిల్లాలోని పార్టీ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు కాకాణి తెలిపారు.

Similar News

News November 20, 2025

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.

News November 20, 2025

NLR: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని డాక్టర్ BRఅంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ప్రభావతి ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీతో పాటు పీజీ పాసైన వాళ్లు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు శనివారంలోపు నెల్లూరు పాత జూబ్లీ ఆస్టిల్ ఆవరణలోని కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. సోమవారం ఉదయం 11 గంటల్లోపు డెమోకు హాజరు కావాలని సూచించారు.

News November 19, 2025

మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

image

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.