News June 7, 2024
YCP మాజీ MLA ఆర్కే స్వగ్రామంలో TDPకి మెజారిటీ

రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ MLA ఆర్కే స్వగ్రామం పెదకాకానిలో TDPకి మెజారిటీ వచ్చింది. ఆళ్ల కుటుంబం ఓటు వేసిన పోలింగ్ కేంద్రం 32లో కూడా ధూళిపాళ్ల నరేంద్ర 201 ఓట్ల ఆధిక్యం సాధించారు. పొన్నూరు పరిశీలకుడిగా RK వ్యవహరించినా టీడీపీకి 32,915 ఓట్ల మెజారిటీ దక్కిందని TDP నేతలు చెబుతున్నారు. 2019లో పెదకాకాని మండలంలో YCPకి 1650 మెజారిటీ రాగా, నేడు టీడీపీకి 10వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు.
Similar News
News November 8, 2025
GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.
News November 8, 2025
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఆయన పార్టీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ కూర్పు వంటి ముఖ్య అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరపనున్నాయి.
News November 8, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

గుంటూరులో నిర్వహించిన పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ 13 వినతులను స్వీకరించారు. బదిలీలు, ప్రమోషన్లు, క్వార్టర్స్ కేటాయింపు, వైద్య సాయం వంటి పలు అంశాలపై వినతులు వచ్చాయి. వీటిని నిష్పాక్షికంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.


